సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 19 : విధివంచితులు, ఆభాగ్యులు, అనాథలకు దేవుడే దిక్కుంటారు. దిక్కూ మొక్కులేని విధివంచితులు నిత్యం రోడ్లపైన, మార్కెట్లలో యాచిస్తూ తిరుగుతుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ప్రమాదాల బారినపడి చనిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. నిరాశ్రయులుగా మారి జీవనం సాగుస్తున్న ఎందరో అభాగ్యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నది. సిద్దిపేట పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతోనే రెండుచోట్ల నిరాశ్రయులకు నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. రాష్త్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో రూ.32లక్షలతో అధునాతన సౌకర్యాలతో నైట్షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో వారికి అన్ని వసతులను కల్పించారు. కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా వారి ఆరోగ్యంపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించేలా ఏర్పాట్లు చేశారు.
జిల్లా ప్రభుత్వ దవాఖానకు దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఖాళీ సమయాల్లో గడిపేందుకు టీవీ, కంప్యూటర్ సౌకర్యాలను కల్పించారు. వారి రక్షణకు పటిష్ట చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వారి వస్తువులను భద్రపరుచుకునేందుకు లాకర్స్ను ఏర్పాటు చేశారు. అభాగ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో వారంలో ఒకరోజు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీర్ఘ్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి జిల్లా దవాఖాన నుంచి వైద్యసేవలు అందిస్తారు. వీటి నిర్వహణ ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా నిర్వహించేందుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నైట్ షెల్టర్ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వారికి స్వయం ఉపాధికి తగు శిక్షణ కల్పించేందులు ప్రణాళికలు రూపొందుస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్నారు