నర్సాపూర్,ఏప్రిల్19: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్లోని మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో కాగజ్మద్దూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సయయంలో రైతులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకము, అకౌంట్ పాస్బుక్ జిరాక్స్లు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, వైస్ ఎంపీపీ నర్సింగరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
మహమ్మద్నగర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో…..
కౌడిపల్లి, మహమ్మద్నగర్లో పీఏసీఎ స్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని వెంకట్రావ్పేట్, ము ట్రాజ్పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్ వె ల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చిన్నంరెడ్డి, సొసైటీ సీఈవో దుర్గాగౌడ్, ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత అమర్సింగ్, పాల్గొన్నారు.
కోనాపూర్ పీఏసీఎస్ కేంద్రంలో….
రామాయంపేట, ఏప్రిల్ 19: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు చేయాలని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఇన్చార్జి సొసైటీ చైర్మన్ విజయలక్ష్మి అన్నారు. కోనాపూర్ పీఏసీఎస్ కేంద్ర ంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .కార్యక్రమంలో సీఈవో మల్లారెడ్డి, సర్పంచ్ చంద్రకళ, ఇమ్మానియేల్, విద్యాసాగర్, గ్రామస్తులు ఉన్నారు
ఐకేపీ ఆధ్వర్యంలో…
మనోహరాబాద్, ఏప్రిల్ 19 : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. చిన్నగొట్టిముక్కల లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మహేశ్గుప్తా, ఎంపీపీ హరికృష్ణలతో కలిసి ప్రారంభించారు.
ఇవీ కూడా చదవండి…
బిజినెస్ డిస్ట్రిక్ట్గా శంషాబాద్
ఎయిర్పోర్టు వరకూ..మెట్రో కారిడార్
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్నారు