హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అన్ని ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. జనసేన సహా ఏ పార్టీతో నూ పొత్తు పెట్టుకోబోమని తేల్చిచెప్పా రు. ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామి అని, దానిపై జాతీయస్థాయిలో నిర్ణయం ఉంటుందని చెప్పారు. తమ పార్టీ నేతల మధ్య బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, నేతలంతా కలిసి పోరాటాలు చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు.