మద్దూరు/సిద్దిపేట : మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలంలోని లద్దునూర్ రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు మండలంలోని చెరువులు, కుంటలలో సుమారు 24 లక్షల చేప పిల్లలను వదిలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో నేడు తెలంగాన చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్, మంద యాదగిరి, వైస్ ఎంపీపీ మల్లిపెద్ది సుమలత మల్లేశం, స్థానిక సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.