ధూళిమిట్ట చెక్డ్యాం వద్ద మత్స్యకారుల సందడి
మద్దూరు: రాత్రి కురిసిన భారీ వర్షానికి మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలోని చెరువు, కుంటలు మరోసారి నిండి మత్తడులు పోస్తు న్నాయి. ధూళిమిట్ట మండల కేంద్రంలోని చెక్డ్యాం నెల రోజుల తర్వాత మరోసారి మత్తడి పోస్తుండడంతో పుష్కలంగా చేపలు బయటకు వస్తున్నాయి.
దీంతో మత్స్యకారులు చేపల వేట కొనసాగించడంతో చెక్డ్యాం వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్రామం నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి మత్స్యకారులు చెక్డ్యాం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు చిక్కిన చేపలు ఒక్కోక్కటి 5కిలోల పైనే ఉన్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.