సాధారణ నొప్పుల నివారణకు శాస్త్రవేత్తలు కొత్తరకం హెడ్సెట్ను సృష్టించారు. ఈ హెడ్సెట్ను తలపై ధరించగానే మొబైల్ యాప్ ద్వారా నొప్పిని నియంత్రించుకునే వీలుంటుంది. 8 వారాల పాటు ఈ హెడ్సెట్ను వాడిన వారిలో నిద్ర, మానసిక స్థితి, జీవన నాణ్యత మెరుగుపడిందని దీనిపై పరిశోధనల చేసిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆందోళన, నిరాశ కూడా తగ్గినట్లు గుర్తించారు. సాధారణ నొప్పులను తగ్గించేందుకు ఫిజియోథెరపీగానీ, పెయిన్ కిల్లర్లనుగానీ ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి ప్రతి రోగిలో ప్రభావవంతంగా ఉంటాయన్నది రుజువు కాలేదు. కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలు కూడా బయటపడ్డాయి.
ఈ పెయిన్ కిల్లర్ హెడ్సెట్ మెదడు తరంగాలను చదువుతుందని, ఇది నొప్పిని ఎదుర్కోవటానికి మెదడును సిద్ధం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ హెడ్సెట్ ఎలక్ట్రో-ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) టెక్నాలజీ సాయంతో పనిచేస్తుందని వెల్లడించారు. హెడ్సెట్లోని 8 ఎలక్ట్రోడ్లు మెదడు విద్యుత్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని వారు తెలిపారు. ఈ ఈఈజీ యంత్రంతో మూర్ఛ వంటి వ్యాధులను కూడా కనుగొనేందుకు వీలుచిక్కుతుందని వారంటున్నారు. ఆర్థరైటిస్ వంటి వ్యాధులలో తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు మెదడు నరాల నుంచి నిరంతరం సంకేతాలను పొందుతుందని, అయితే ఈఈజీ న్యూరోఫీడ్బ్యాక్ ద్వారా బాధాకరమైన మెదడు తరంగాలను అణిచివేస్తుందని వారు తెలిపారు.
చర్మం, కీళ్ళు, అవయవాలలో ఉన్న ప్రత్యేక గ్రాహకాలు మెదడుకు నరాల ద్వారా నొప్పి సంకేతాలను పంపినప్పుడు మనకు నొప్పి వస్తుందని నార్తంప్టన్షైర్లోని ఈస్ట్ మిడ్లాండ్ వెన్నెముక క్లినిక్లో వెన్నెముక సర్జన్, పరిశోధకుడు నిక్ విర్చ్ తెలిపారు. ట్రయల్స్ సందర్భంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న 16 మంది రోగులు ఈ హెడ్సెట్ను 8 వారాలపాటు వాడారు. ఈ రోగుల్లో నొప్పి తగ్గుదల కనిపించింది. 90 శాతం మంది రోగులు ఈ హెడ్సెట్ సాయంతో హాయిగా నిద్ర పోవడం, నిరాశ చెందకుండా, ఆందోళనకు గురవకుండా ఉండటం గమనించారు.
వచ్చే ఏడాది కల్లా ఈ హెడ్సెట్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. మార్కెట్లోకి రావడానికి ముందు న్యూజిలాండ్లో పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించనున్నారు. పోర్టబుల్ ఈఈజీ-న్యూరోఫీడ్బ్యాక్ పరికరం గొప్ప అభివృద్ధి అని లివర్పూల్లోని ది వాల్టన్ సెంటర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నిక్ సిల్వర్ చెప్పారు.
భారత మార్కెట్లోకి యమహా ఎఫ్జెడ్25
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా వర్సిటీలు : వెంకయ్యనాయుడు
రికార్డు ఆదాయం అందుకున్న అమూల్
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..