దేశంలోని అతిపెద్ద పాల బ్రాండ్ సంస్థ అముల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,248 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. దాని మొత్తం గ్రూప్ వ్యాపారం రూ.53 వేల కోట్లు దాటింది. సంస్థ చరిత్రలో ఇప్పటివరకు ఇదే రికార్డు వ్యాపారం. మరోవైపు, పాల ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం తగ్గాయి.
గత ఏడాది అముల్ టర్నోవర్ రూ.38,542 కోట్లు. 2025 నాటికి ఆదాయాన్ని రూ.లక్ష కోట్లకు చేర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. 2012 లో అమూల్ సంస్థ ప్రపంచంలో 18 వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 8 వ అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థగా మారింది. వాస్తవానికి కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. ఈ కారణంగా సంస్థ వ్యాపారం అమాంతం పెరిగింది. దీని సభ్యులు 2021 లో పాల సేకరణలో 14 శాతం వృద్ధిని సాధించారు. రోజుకు 40 లక్షల లీటర్ల పాలను అమ్మకాలు జరుపుతుండగా.. పాలు, జున్ను, వెన్న, ఐస్క్రీమ్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ ఉత్పత్తులు మన దేశంలోని పెద్ద కంపెనీలైన బ్రిటానియా, హిందూస్తాన్ యూనిలీవర్లతో పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తులు ఏటా 8.1 శాతం చొప్పున పెరుగుతూ లాభాలను మూటగట్టుకుంటున్నది. ఈ సంవత్సరం 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న అమూల్ సంస్థ 47 వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) మంగళవారం జరిగింది. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం నుంచి అమూల్ తన ప్రయాణాన్ని ప్రారంభించి తొలుత ఉత్తర భారతదేశానికి, అనంతరం మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ సంస్థ గత ఏడాదే హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశంలో తన వ్యాపారాలను ప్రారంభించింది.
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్వర్రీ కారు ఉందిగా..!
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..