లండన్ : బ్రిటన్లో అధికారిక రహస్యాల చట్టాన్ని మార్చేందుకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కథనాలు రాసే జర్నలిస్టులకు ఇకపై 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, వారిని విదేశీ గూఢచారులుగా పరిగణిస్తారు. బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పాటిల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ డైలీ మెయిల్ కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్నెట్ ప్రభావాన్ని ముఖ్యంగా వేగంగా డాటా బదిలీ సాంకేతిక పరిజ్ఞానం యుగాన్ని దృష్టిలో ఉంచుకుని 1989 లో చేసిన ఈ చట్టంలో అవసరమైన మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. మానవ హక్కుల సంస్థ, లా కమిషన్ దాని బ్లూప్రింట్ను సిద్ధం చేశాయి.
జర్నలిస్టులకు తమను తాము రక్షించుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ చట్టంలో ఇప్పటికే మార్పులు జరిగి ఉంటే, ఆరోగ్య కార్యదర్శి మాట్ హన్నాక్ కొవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్లు వెల్లడించిన జర్నలిస్టుపై విచారణ జరిగే అవకాశం ఉండేదని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుత చట్టం లీకర్స్ లేదా విజిల్బ్లోయర్స్, లీకర్స్, విదేశీ గూఢచారుల మధ్య నిబంధనలు, శిక్షలను వేరు చేస్తుందని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్యూజే) ప్రతినిధి అన్నారు. తప్పు చేసే జర్నలిస్టులకు కఠిన శిక్ష వేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఎన్యూజే నాయకురాలు చెప్పారు.
ఈ చట్టాలు చేసిన సమయంలో కమ్యూనికేషన్ మార్గాలు చాలా పరిమితంగా ఉండేవని ప్రభుత్వం చెప్తున్నది. ఏ దేశమైనా తమ దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ఎలాంటి డాటాతోనైనా కంటి రెప్పలో సవాలు చేసే అవకాశాలు ఉన్నందునే వాటిని సవరించడం అవసరమని ప్రభుత్వం సమర్ధించుకుంటున్నది.
ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా వర్సిటీలు : వెంకయ్యనాయుడు
రికార్డు ఆదాయం అందుకున్న అమూల్
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్వర్రీ కారు ఉందిగా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..