న్యూఢిల్లీ : యమహా మోటర్ ఇండియా యమహా ఎఫ్జెడ్25 కొత్త మోటో జీపీ ఎడిషన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారం కింద మోటార్ ఇండియా దీనిని ప్రారంభించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,36,800 గా నిర్ణయించారు. ఈ రోడ్స్టర్ బైక్ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.అయితే, కంపెనీ ఎన్ని యూనిట్లు అనే సమాచారం ఇవ్వలేదు.
‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ఆత్మ యమహా రేసింగ్ డీఎన్ఏ నుంచి పుట్టిందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి శితారా చెప్పారు. ఈ సంవత్సరం మోటో జీపీలో పనితీరు అసాధారణంగా ఉన్నదని, ఇప్పటివరకు మూడు స్టాండింగ్లలో- టీమ్, కన్స్ట్రక్టర్, రైడర్షిప్లో మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.
భారతీయ వినియోగదారుల కోసం ఎఫ్జెడ్25 మాన్స్టర్ ఎనర్జీ యమహా మోటో జీపీ ఎడిషన్ను విడుదల చేస్తున్నామన్నారు. మోటో జీపీ వేరియంట్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఎఫ్జెడ్25 మాన్స్టర్ ఎనర్జీ మోటో జీపీ ఎడిషన్ మరికొన్ని రోజుల్లో భారతదేశంలో లభించనున్నది. స్పెషల్ ఎడిషన్లో ట్యాంక్ ష్రుడ్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్లపై యమహా మోటో జీపీ బ్రాండింగ్ ఉంటుంది. ట్యాంక్, సైడ్ ప్యానెళ్లపై మాన్స్టర్ ఎనర్జీ డికాల్స్ను చాలా ఆకర్శణీయంగా ఏర్పాటు చేశారు. కొత్త బైక్లో మల్టీ-ఫంక్షన్ నావిగేషన్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లాస్-డి బై-ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ ఉన్నాయి. ఈ బైక్కు 249 సీసీ ఎయిర్ కూల్డ్, ఎస్ఓహెచ్సీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది.
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా వర్సిటీలు : వెంకయ్యనాయుడు
రికార్డు ఆదాయం అందుకున్న అమూల్
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..