ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్ ఓలా, సింపుల్ వన్.. ఇండియాలో లాంచ్ అయ్యాయి. టాటా కూడా ఎలక్ట్రిక్ కార్లను ఇప్పటికే రిలీజ్ చేసింది. మహీంద్రాతో పాటు పలు కార్ల బ్రాండ్ కంపెనీలు.. ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి.
అయితే.. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వచ్చే ఒకే ఒక సమస్య.. చార్జింగ్. ఫుల్ చార్జింగ్ చేశాక.. లాంగ్ డ్రైవ్కు వెళ్తే.. అప్పుడు చార్జింగ్ ఎలా? అనేదే ప్రతి ఒక్కరిని తొలుస్తున్న ప్రశ్న. దాని కోసం దేశవ్యాప్తంగా పలు బ్యాటరీ స్టోరేజ్ కంపెనీలతో పాటు.. ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే కంపెనీలు కూడా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి.
తాజాగా.. బ్యాటరీ స్టోరేజ్, చార్జర్ డెవలప్మెంట్ కంపెనీ Ez4EV కూడా దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. అవి ఆన్ డిమాండ్ మొబైల్ ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు. వాటికి EzUrja అనే పేరు పెట్టింది ఆ కంపెనీ.
వచ్చే కొన్ని నెలల్లోనే చార్జింగ్ స్టేషన్లను తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది. స్మార్ట్ఫోన్తో ఏటీఎంలను లొకేట్ చేసినట్టుగా.. కస్టమర్లు మొబైల్ చార్జింగ్ స్టేషన్లను లొకేట్ చేసుకోవచ్చని.. కస్టమర్లు కోరిన చోటే మొబైల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
దేశంలోని పలు నగరాలు, హైవేల మీద ఈ మొబైల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. చిన్న పట్టణాల్లోనూ మొబైల్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు.
Internet of Things (IoT) device తో ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఎక్కడైతే మొబైల్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండవో… అక్కడే వీటిని ఏర్పాటు చేస్తాం. దాని వల్ల.. ఎలక్ట్రిక్ వాహనం ఉన్న ఓనర్.. టెన్షన్ పడకుండా.. తమ వాహనానికి సులువుగా చార్జింగ్ చేసుకోవచ్చు.. అని ఆ కంపెనీ సీఈవో సతీందర్ సింగ్ వెల్లడించారు.
మొబైల్ చార్జింగ్ స్టేషన్లలో.. స్లో, ఫాస్ట్ చార్జింగ్ ప్లగ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ ద్వారా చేసే చార్జింగ్ పూర్తిగా పర్యావరణహితమైనది, 100 శాతం కార్బన్ ఎమిషన్ ఫ్రీ ఎనర్జీని ఉపయోగించి చార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాని వల్ల.. ఎటువంటి ఆటంకం లేకుండా చార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే.. ఈ మొబైల్ స్టేషన్లు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Junk Files : కంప్యూటర్ స్లోగా రన్ అవుతోందా? సిస్టమ్ ఫాస్ట్ కావాలంటే జంక్ ఫైల్స్ను ఇలా క్లీన్ చేసుకోండి
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్ను లాక్ చేయడం ఎలా?
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు