ప్రధాన రైల్వే స్టేషన్లలో రోజుకు లక్షల మంది వస్తూ పోతుంటారు. అయితే.. ఒక్కరోజు రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఎంత అని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అందుకే.. రైల్వే స్టేషన్లలో కిక్కిరిసిపోయే ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు.. అనేది కనుక్కోవడం కోసం ఇండియన్ రైల్వేస్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అదే ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్.
ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ద్వారా ఒక రైల్వే స్టేషన్కు ఒక్క రోజులో వచ్చిన ప్రయాణికుల సంఖ్యను తెలుసుకోవచ్చు. దాని కోసం ముందుగా దేశంలోని 30 రైల్వే స్టేషన్లలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇదీ చదవండి : Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని రైల్వే స్టేషన్లతో పాటు.. ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లు, మహారాష్ట్రలోని మరికొన్ని రైల్వే స్టేషన్లలో 500 ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క ముంబైలోనే.. అక్కడి లోకల్ ట్రెయిన్స్ ద్వారా రోజుకు 70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. అందుకే.. లోకల్ రైల్వే స్టేషన్లలో కూడా ఈ కెమెరాలను ఫిక్స్ చేసింది ఇండియన్ రైల్వేస్.
ఈ కెమెరాలను రష్యాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఎన్టెక్ల్యాబ్స్ డెవలప్ చేసింది. ప్రయాణికుల సంఖ్యను తెలపడంతో పాటు… 50 మంది ప్రయాణికులను ఒకే ఫ్రేమ్లో ఉంచుతుంది. మాస్క్ వేసుకొని ఉన్నా కూడా వాళ్ల ఫేస్ను రికగ్నైజ్ చేస్తుంది. అలాగే.. ప్రయాణికుల గుంపులో క్రిమినల్స్ ఉంటే.. వాళ్లను పట్టుకోవడంలో ఈ కెమెరాలు సహాయం చేస్తాయి. ఎవరైనా తప్పిపోయినా కూడా ఈ కెమెరాల ద్వారా వాళ్లను ట్రాక్ చేయొచ్చు. త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ రైల్వేస్ సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చదవండి : Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
అయితే.. ఈ ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ప్రజల ప్రైవసీ, స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని క్రిటిక్స్ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ను మన దేశంలోనే చాలా సార్లు ఉపయోగించారు. పోలీసులు కూడా నేరస్థులను పట్టుకునేందుకు ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ త్రినేత్రను ఉపయోగిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి