ఒకప్పుడు అంటే.. ఒకటి రెండు దశాబ్దాల క్రితం.. యాహూకు ఇండియాలో ఎంతో క్రేజ్ ఉండేది. అప్పుడు యాహూ మెయిల్నే ఎక్కువగా ఉపయోగించేవారు. యాహూ న్యూస్నే ఆన్లైన్లో చదివేవారు రీడర్స్. ముఖ్యంగా యాహూ క్రికెట్ న్యూస్ను మాత్రం రెగ్యులర్గా క్రికెట్ లవర్స్ ఫాలో అయ్యారు. అలాగే.. ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, యాహూ న్యూస్ లాంటి వెబ్సైట్లకు ట్రాఫిక్ బాగానే వచ్చేది.
కానీ.. ఎప్పుడైతే గూగుల్.. ఇండియాలో అడుగుపెట్టిందో.. సెర్చ్ ఇంజన్, జీమెయిల్ను ప్రారంభించిందో.. అప్పటి నుంచి యాహూకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియాలో అప్పటి వరకు టాప్లో ఉన్న యాహూను గూగుల్ వెనక్కి నెట్టేసింది.
నిజానికి.. గూగుల్ సెర్చ్ ఇంజన్ లేనప్పుడు… మనం యాహూ సెర్చ్ ఇంజన్నే యూజ్ చేసేవాళ్లం. యాహూ మెయిల్నే వాడేవాళ్లం. కానీ.. ఇప్పుడు యాహూ మెయిల్ను చాలా తక్కువ మంది వాడుతున్నారు. యాహూలో సెర్చ్ చేసేవాళ్లు కూడా కరువయ్యారు.
అందుకే.. యాహూ.. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డౌన్ అవుతూ వచ్చింది. తాజాగా.. ఇండియాలో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్ ఇండియా లాంటి సైట్లను షట్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. ఈ సైట్లను భారత్లో షట్డౌన్ చేయడం వెనుక వేరే కారణం ఉంది. అదే ఎఫ్డీఐ. దాన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ప్రస్తుతం ఎఫ్డీఐలో వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఇండియాలోని డిజిటల్ కంటెంట్ పబ్లిష్, ఆపరేషన్ మీద మీడియా కంపెనీల ఫారెన్ ఓనర్షిప్ లిమిట్ను తగ్గించారు. ఆ లిమిట్ దాటితే.. ఎఫ్డీఐ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. అందుకే.. యాహూ.. ఇండియాలో తన న్యూస్ సైట్లను అన్నింటినీ.. ఆగస్టు 26, 2021 నుంచి షట్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. యాహూ ఈమెయిల్, యాహూ సెర్చ్ మాత్రం యధావిధిగా నడవనున్నాయి.
కొత్త ఎఫ్డీఐ రెగ్యులేషన్స్ ప్రకారం.. డిజిటల్ మీడియా కంపెనీలు.. ఇండియాలో కేవలం 26 శాతం వరకు మాత్రమే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ను పొందే వీలు ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే ఫారెన్ కంపెనీ.. ఇండియన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.