అమీన్పూర్ : 400 గజాల ప్లాట్ను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం అమీన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం అమీన్పూర్ శివారులో సర్వే నంబర్. 966,967,969లో గల ప్లాట్ నం. 297(400 గజాలు)ను మలక్పేట్కు చెందిన హరికృష్ణ, బోరబండ మృత్యుంజయ, చైతన్యపురికి చెందిన కుంచాల మల్లేశ్లు ప్లాట్కు నకిలీ దస్తా వేజులు తయారు చేయించారు. రూ. 16లక్షలకు 2016లో సంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎల్బీ నగర్కు చెందిన వింత విజయలక్ష్మికి అసలు ఓనరు శివకుమార్కు బదులు మృత్యుంజయ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ తరువాత బీహెచ్ఈఎల్ ఆర్టీసీలో పని చేస్తున్న మృత్యుంజయ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రరావు, నీల శ్రీనివాస్, సుశీలతో కుమ్మక్కై సుశీల పేరున మరో నకిలీ డాక్యుమెంట్ తయారు చేయించి 2016లోనే శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డాక్యుమెంట్లను స్టేట ఫైనాన్స్లో కుదవ పెట్టి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ప్లాట్ ఆసలు ఓనర్ శివకుమార్ ఫిర్యాదు చేశాడు.
శివకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని హరికృష్ణ, మృత్యుంజయ, కుంచాల మల్లేశ్, ఉబ్చాల శ్రీరామచంద్రరావు, నీల శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో పరారీలో ఉన్న నింధితులను త్వరలో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.