నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రకమైన రామమందిరంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయానికి వేసి ఉన్న తాళం పగుల గొట్టి సీతమ్మవారి మెడలోని పుస్తెలతాడు సహా ముక్కు పుడకను అపహరించారు.
రోజు మాదిరిగానే ఆలయ పూజారి శనివారం ఉదయం ఆలయానికి రాగా తాళం పగుల గొట్టి, తలుపులు తెరిచి ఉండడంతో ఆయన ఆలయ కమిటీ చైర్మన్ ముత్యపు హన్మాండ్లుకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వెంకట్రెడ్డి ఆలయాన్ని సందర్శించి విచారణ జరిపారు. పుస్తెలతాడు, ముక్కు పుడక రూ.50 వేల విలువ ఉంటుందని పాలకవర్గ సభ్యులు తెలిపారు.