జహీరాబాద్, జూలై 27: పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మం జూరు చేసిందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి పేదవారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు చేసి ఆదర్శంగా నిలిచిందన్నారు. వచ్చే నెలా నుంచి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్కార్డు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొందరికి రేషన్ కార్డులు రాలేదని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంజీ.రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, తహసీల్దార్ పి.నాగేశ్వర్రావు, నయాబ్ తహసీల్దార్ కిరణ్కుమార్ టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.