అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని విజయవాడ(Vijayawada) లో నిర్వహించిన రోడ్ షో (Modi Road Show) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ స్టేడియం రోడ్ షో పాయింట్ వద్ద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu), జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్(Pawan Kalyan) మోదీకి స్వాగతం పలికారు అనంతరం టాప్లేని జీపులో ముగ్గురు రోడ్ షోలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రచారం నిర్వహించారు.
మున్సిసల్ స్టేడియం నుంచి బందర్రోడ్లో బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని పాల్గొంటున్నారు. అంతకు ముందు అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు (Pileru) నియోజకవర్గంలో కలికిరిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఏపీలో వైసీపీ అరాచకపాలనను అంతమొందిస్తామని పేర్కొన్నారు. మోదీ లక్ష్యం వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.