Actor Ajith | తెలుగు టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movies Makers) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్టు అందించింది. ఇక ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ఇక ఈ టాప్ బ్యానర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ (RaviTeja), గోపీచంద్ మలినేనిల కాంబోతో పాటు.. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2తో ఫుల్ బిజీగా ఉంది. ఇంకా ఇవే కాకుండా పలు సినిమాలు ఈ బ్యానర్ ఖాతాలో ఉన్నాయి.
అయితే ఈ బ్యానర్కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కొత్త ప్రాజెక్ట్ను రేపు ఉదయం 11.07 గంటలకు ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movies Makers) వెల్లడించింది. అయితే రేపు విజయ్ దేవరకొండ బర్త్ డే అవ్వడంతో తనతోనే కొత్త ప్రాజెక్ట్ను మైత్రీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై క్లారిటీ రావాలి అంటే రేపటివరకు వేచి చూడాల్సిందే.
‘A wild ride into untold HIStory’ ⚔️
Announcement tomorrow at 11.07 AM 🔥
An epic from the house of @MythriOfficial. pic.twitter.com/mZnNXoshyI
— Vamsi Kaka (@vamsikaka) May 8, 2024
మరోవైపు ఈ బ్యానర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్తో సినిమా ప్లాన్ చేస్తుందని సమాచారం. దీనికి అజిత్ కూడా ఒకే చెప్పినట్లు టాక్. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు నుంచి అయిన తమిళం నుంచి అయిన ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.