తిరుమల : వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపైన ఉన్న కంపార్టుమెంట్లన్నీ (compartmets) నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు నిండిపోయి గోగర్భం జలాశయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైబడి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలిపిరి గుండా కాలినడకన వచ్చిన భక్తులకు సుమారు 25 వేల టికెట్లను పంపిణీ చేశారు. నిన్న 71,150 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 43,199 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.63 కోట్లు వచ్చిందని వివరించారు.