Prasanna Vadanam | యంగ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహించగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్పై మణికంఠ JS, ప్రసాద్ రెడ్డి TR సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మే 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 20 రోజులు కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ‘ఆహా’ గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఒకరోజు ముందుగానే అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రముఖ రేడియో కంపెనీలో ఆర్జేగా(Radio Jockey) పని చేస్తుంటాడు సూర్య (సుహాస్). అయితే అనుకోకుండా సూర్య లైఫ్లో ఒక ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదం వలన సూర్య అమ్మానాన్నల్ని కోల్పోవడంతోపాటు.. ఫేస్ బ్లైండ్నెస్ (ప్రోసోపాగ్నోసియా) సమస్య బారిన పడతాడు. ప్రోసోపాగ్నోసియా వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుపడతారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్ ముందు ఓ హత్య జరుగుతుంది. తనకున్న సమస్యతో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసులకి ఈ విషయం తెలిపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ విషయం పోలీసులకు చేప్పే లోపే అతడిపై దాడి జరుగుతుంది. ఈ క్రమంలోనే సూర్య ఏం చేశాడు. మర్డర్ చేసిన వ్యక్తిని ఎలా గుర్తుపట్టాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Without a Face, But Not Without Courage..💪
A Hero’s Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!
(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024