షాద్నగర్టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవనిలా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 24వ వార్డు ఎల్ఎన్కాలనీకి చెందిన జయమ్మ ఆనారోగ్యంతో బాధపడుతూ కొన్నిరోజుల క్రితం ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నారు. జయమ్మ కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2లక్షల చెక్కును శనివారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి వరంలా మారిందన్నారు. సీఎం సహాయనిధి చెక్కు అందజేయడంపై సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు జయమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నందీశ్వర్, నాయకులు వెంకటేష్గౌడ్, అమినొద్దీన్ పాషా, శ్రీధర్చారి, వెంకటేష్గుప్తా పాల్గొన్నారు.