డిజిటల్ ఇండియా జరిగిందా?
అచ్చేదిన్ వచ్చిందా?
సచ్చేదిన్ వచ్చిందా?
మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా?
ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజనతో ఏమన్న లాభం జరిగిందా?
ఫసల్బీమా ఏ రైతుకైనా వచ్చిందా?
ఎవరికైనా రూ.15 లక్షలు వచ్చాయా?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైంది.
రైతుబంధు కేసీఆర్ 10 వేలు ఇస్తాండు, నేను 15 వేలు ఇస్తా అని చెప్పారు.మరి వచ్చినయా?
కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తాండు, మేము తులం బంగారం ఇస్తమన్నరు.. ఇస్తున్నరా?
మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నయా?
ఆసరా పింఛన్ 4 వేలు అయిందా?
ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా?
రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా?
వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా?
తెలంగాణ నా కండ్ల ముందే నాశనం అయిపోతే, చూస్తూ ఉరుకోవాల్నా? యుద్ధం చేద్దామా? కొట్లాడుదామా? అందరూ తయారుగా ఉండాలె
– కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి చోటేభాయ్, ప్రధాని మోదీ బడేభాయ్ అని.. బడేభాయ్ తెలంగాణపై పగబడితే, చోటేభాయ్ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయొద్దని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన ప్రసంగిస్తూ.. ‘నా ప్రాణం ఉన్నంత వరకు, నా కండ్ల ముందటనే తెలంగాణను నాశనం చేస్తమంటే, యుద్ధం చేస్త తప్ప, నిద్రపోను. ఆనాడు అంత కష్టపడి, నా ప్రాణాలకు తెగించి, సచ్చిపోయిన ఫర్వాలేదని ఆమరణ నిరాహర దీక్ష చేసి, తెలంగాణ తెచ్చా. అలాంటి తెలంగాణ నా కండ్ల ముందే నాశనం అయిపోతే, చూస్తూ ఉరుకోవాల్నా? యుద్ధం చేద్దామా? కొట్లాడుదామా? అందరు తయారుగా ఉండాలె’ అని పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైంది. ఆ పార్టీకి ఓటు వేస్తే రైతుబంధు అందరికీ వచ్చిందా? కేసీఆర్ 10 వేలు ఇస్తాండు, నేను 15 వేలు ఇస్తా అని చెప్పారు. మరి వచ్చినయా? కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తాండు, మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. మహిళలకు రూ.2,500 వచ్చాయా? ఆసరా పింఛన్ 4 వేలు అయిందా? రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందానేనా? గ్యారెంటీగా గోవిందానేనా?’ అని సభికులను కేసీఆర్ ప్రశ్నించగా.. గోవిందానే అని సమాధానం ఇచ్చారు. వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? అని అడిగారు. దానికి రాలేదన్న జవాబే వినిపించింది. స్కూటీలు రాలే, కానీ లూటీలు వస్తున్నాయని కేసీఆర్ ఆరోపించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నలుగురు విద్యార్థులు చనిపోయారని, విషాహారం పెడుతున్నారని, దానిని చూసే దిక్కులేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం లేదని, ఐదు నెలల నుంచి రూపాయి లేదని, అవి ఎలా నడవాలని ప్రశ్నించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.20 లక్షలు ఇచ్చామని, దాన్నీ బంద్ పెట్టారని, ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీంలోనూ దగా, అన్ని రకాలుగా మనల్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెతారు. చేనేత కార్మికులకు రూపాయి కూడా ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 33 జిల్లాలు చేసుకున్నం. ఒక్క నవోదయ పాఠశాలైనా మోదీ ఇచ్చారా? కొత్తగా తెచ్చుకున్న పేద రాష్ర్టానికి, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. మోదీ దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తెలంగాణకు నాలుగు కాలేజీలు ఇవ్వాలని బతిమిలాడినా ఒక్క కాలేజీ ఇవ్వలేదు.
– కేసీఆర్
బీజేపీ, కాంగ్రెస్ పథకాలు వచ్చినయా? అమలవుతున్నాయా? అని అడిగి సభికుల నుంచి కేసీఆర్ సమాధానాన్ని రాబట్టారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సభకు హాజరైన ప్రజలు ఉత్సాహంగా సమాధానమిచ్చారు. బీజేపీ ఈ దేశాన్ని పదేండ్ల నుంచి పాలిస్తున్నదని, బీజేపీ గురించి ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలు ఆలోచన చేయాలని, మన కండ్లను మనమే పొడుచుకుందామా? విషం ఇస్తే తాగుదామా? అని అడిగారు. ‘మహబూబ్నగర్లో పోటీచేస్తున్న అభ్యర్థి ఎవరు? ఆమె గుణగణాలు ఏంది? బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేమిటి? నరేంద్రమోదీ ఎన్ని నినాదాలు చెప్పారు? కనీసం 100 నినాదాలు చెప్పాడు. ఒక్క నినాదమన్న నిజమైందా? కట్టుకథలు, పిట్ట కథలు చెప్పారు. మోదీ పాలనలో ఎవరికైనా లాభం జరిగిందా? భేటీపడావో, భేటీబచావో పథకం అమలైందా? మేకిన్ ఇండియా బక్వాస్, సబ్ కా సాత్, సబ్ కా వికాస్, దేశ్ కా సత్యనాశ్, డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? అమృత్కాల్ లేదు, మన్నూ లేదు. దేశమంతా నాశనం అయ్యింది. ఆత్మనిర్భర్ భారత్ అ య్యిందా? జన్ ధన్ యోజనతో ఏమన్న లా భం జరిగిందా? ఫసల్బీమా ఏ రైతుకైనా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్రమోదీ విశ్వగురువా?’ అని ప్రశ్నిస్తూ కేంద్రంలోని బీజేపీపై మండిపడ్డారు. డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కానీ, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయారని దుయ్యబట్టారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నదని, మహబూబ్నగర్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ముస్లింలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సెక్యులర్ ప్రభుత్వాన్ని నడిపామని, ప్రాణం పోయినా ఫర్వాలేదు.. చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటానని స్పష్టం చేశారు. ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు తెరిపించామని చెప్పారు. ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం అని, గతంలో ప్రతి రంజాన్కు పేద ముస్లింలకు తోఫా అందించామని గుర్తుచేశారు. ‘ఈసారి వచ్చిందా?’ అని ప్రశ్నించగా ‘రాలేదు’ అని సమాధానం వచ్చింది. దేశంలోనే మొదటిసారి తాము మౌజంలు, ఇమామ్లకు గౌరవ వేతనాలు అందించామని వివరించారు. ఉద్యమం సమయంలో ‘అల్లాకే ఘర్ మే ధేర్ హై.. మగర్ అంధేర్ నహీ హై’ అని తాను చెప్పేవాడినని, అల్లా దయతో రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు.
డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కానీ, పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా తేలేకపోయారు. మనం ఉద్యమం చేస్తుంటే, ఆంధ్ర వాళ్లు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే, డీకే అరుణ వెళ్లి వాళ్లకు మంగళహారతులు పట్టారు. బీజేపీ మనకు అక్కరకురాని చుట్టం.
– కేసీఆర్
వ్యవసాయ బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పారని, మీటర్లు పెట్టకపోతే ఏటా రూ.5 వేల కోట్ల గ్రాంట్ బంద్ చేస్తానన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. తన ప్రాణం పోయినా, తలకాయ తెగినా, తాను మీటర్లు పెట్టబోనని తేల్చి చెప్పానని వెల్లడించారు. ‘మీటర్లు పెట్టాల్నా? వద్దా? మోదీకి ఓటేస్తే మేము మీటర్ పెట్టుమని చెప్పినంక కూడా రైతులు మాకే ఓటు వేశారని, కచ్చితంగా మీటర్లు పెడుతానని మోదీ అంటడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేభాయ్, మోదీ బడేభాయ్. చోటేభాయ్కు ఓటేసినా, బడేభాయ్కు ఓటేసినా మీటర్లు పెడుతారు. మీటర్లు పెట్టుకోవాల్నా అనేది ప్రజలే ఆలోచన చేయాలె’ అని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏడు మండలాలను, 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంటును ఏపీకి ఇచ్చేశారని, ఇటువంటి మోదీకి మనం ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. మనం ఉద్యమం చేస్తుంటే, ఆంధ్ర వాళ్లు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే, డీకే అరుణ వెళ్లి మంగళహారతులు పట్టారని మండిపడ్డారు. బీజేపీ అక్కరకురాని చుట్టమని ఎద్దేవా చేశారు.
ప్రపంచంలో డాలర్తో పోల్చితే రూపాయి విలువ 83 రూపాయలకు పడిపోయిందని, ఇది దేశానికి గౌరవమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది నరేంద్రమోదీ పరిపాలన ఫలితామా? అని అడిగారు. కేంద్రంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని నింపటం లేదని, మరి నిరుద్యోగం ఎలా పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపుగా 750 మంది రైతులు చనిపోయారని, పోలీసు కంచెలు పెట్టి కొట్టారు తప్ప వారిని దగ్గరికి రానివ్వలేదని గుర్తుచేశారు. చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు తాను చెక్కులు ఇచ్చానని వెల్లడించారు. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని, తెలంగాణలో 33 జిల్లాలు చేసుకున్నామని, ఒక్క నవోదయ పాఠశాలైనా మోదీ ఇచ్చారా? అని నిలదీశారు. కొత్తగా తెచ్చుకున్న పేద రాష్ర్టానికి, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మోదీ దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, తెలంగాణకు నాలుగు కాలేజీలు ఇవ్వాలని బతిమిలాడినా ఒక్క కాలేజీ ఇవ్వలేదని తెలిపారు. ‘యువకులకు ఒకటే చెప్తున్నా. భవిష్యత్తు మీది. తెలంగాణ మీది. ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తరో, ఎవరు న్యాయంగా ఉంటరో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పనిచేయని వారికి ఓటు వేస్తే ఇబ్బంది పెడుతారు’ అని సూచించారు.
రోడ్షోలో మాట్లాడుతూ బీజేపీ స్వభావాన్ని కేసీఆర్ పద్యం ద్వారా వివరించారు. సుమతి శతకంలోని ఒక పద్యాన్ని చదివి వినిపించారు. ‘అక్కరకు రాని చుట్టం, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునదా, నెక్కిన బారని గుర్రం, గ్రక్కున విడువంగ వలయు గదరా’ అని పేర్కొన్నారు.
‘ఒక పార్టీయేమో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లడుగుతున్నది. ఇంకోపార్టీ దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు అడుగుతున్నది. సీఎం పోయి యాదగిరి నర్సన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, బాసర సరస్వతమ్మ మీద ఒట్టు అంటున్నడు. ఈ ఒట్ల రాజకీయాలు ఎవరైనా నమ్ముతారా? దమ్ముంటే అప్పుడే చేయాలి కదా?’ అని కేసీఆర్ విమర్శించారు.
‘మహబూబ్నగర్ జిల్లా రైతులైతే 25 నుంచి 30 ఎకరాలున్నా హైదరాబాద్కు వచ్చి ఆటో నడిపిచ్చిండ్రు. గొడగొడ ఏడ్చిండ్రు, ఉద్యమం జరిగేటప్పుడు నా దగ్గరకు వచ్చిండ్రు. అట్లాంటి వాళ్లను ఆదుకోవాలనే రైతుబంధు పెట్టినం. ఇయ్యాల మూడెకరాలకే వేస్తం. ఐదెకరాలకే వేస్తం. ఐదుకరాలు దాటితే ఇయ్యం అంటే నీ అయ్య జాగీరా? రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు ఐదెకరాలోనికి బంద్ పెడుతావు. ఆరో ఎకరమోడు ఎక్కడికి పోవాలె? ఏడో ఎకరమోడు ఎక్కడికి పోవాలె? వాడెమ్మన్న కోటీశ్వరుడా? అయితే 25 ఎకరాలు దాటిన తర్వాత బంద్ పెడుతామంటే ఒక లెక్క. కాని ఐదెకరాలకే బంద్ పెడతానంటే ఎట్ల? రైతుబంధు కూడా ఉంచుతరో, ఊడగొడుతరో. రైతుబీమా కూడా ఉంటదో, ఉండదో తెల్వదు. రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాలు, మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలె’ అని పిలుపునిచ్చారు. మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు బలం కావాలని, ప్రజలే ఆ బలమని, ఇక్కడ శ్రీనివాస్రెడ్డి గెలిస్తే మహబూబ్నగర్ బీఆర్ఎస్ బలపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్కు ప్రజలే శక్తి అని, అది ప్రజలకే ఉపయోగపడుతుందని వెల్లడించారు.
రైతుబంధు కూడా ఉంచుతరో, ఊడగొడుతరో. రైతుబీమా కూడా ఉంటదో, ఉండదో తెల్వదు. రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాలు, మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలె.
– కేసీఆర్
‘ఏమయ్యా సీఎం నువ్వు పథకాలు అమలు చేస్తలేవ్ అంటే, కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా? నీ పేగులు పీకి మెడలో వేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న చడ్డీ గుంజుకుంటా, నిన్ను కొంచబోయి చర్లపల్లి జైల్లో వేస్తా’ అని రేవంత్ అంటున్నారని, ఇది మర్యాదనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘15 ఏండ్లు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, అందరం కలిసి కొట్లాడి, తెలంగాణ తెచ్చుకున్నం. దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నేను చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయే దాకా తెగబడి పోరాడిన. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడటమా?’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాలన ఎట్లా ఉండె? కరెంటు ఎప్పుడన్నా పోయిందా? ఇయ్యాల వస్తున్నదా? ఏం దుర్మార్గమిది చాతనైతలేదా? అని విరుచుకుపడ్డారు. ‘బీజేపోడు వచ్చి కాంగ్రెస్కు బీఆర్ఎస్ బీ టీం అంటడు, కాంగ్రెసోడు వచ్చి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటడు. కానీ భువనగిరిలో ఏం జరిగింది? ఆ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ను తీసేసి, మున్సిపల్ చైర్మన్ సీటును కాంగ్రెస్, వైస్ చైర్మన్ సీటును బీజేపీ పంచుకున్నాయి’ తెలిపారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేభాయ్, మోదీ బడేభాయ్. చోటేభాయ్కు ఓటేసినా, బడేభాయ్కు ఓటేసినా మీటర్లు పెడుతారు. మీటర్లు పెట్టుకోవాల్నా అనేది ప్రజలే ఆలోచన చేయాలె
– కేసీఆర్