School | మల్లాపూర్, జూన్ 24 : ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కుషాయిగూడ పాత మార్కెట్ వద్ద అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్న సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం విద్యార్థి సంఘం నాయకులు కార్పొరేటర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎంఈఓ బాపిరెడ్డి ఎట్టకేలకు స్కూల్ను సీజ్ చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కార్పొరేటర్లు స్కూల్ ఎదుట సుమారు రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారితో ఫోన్లో మాట్లాడి స్కూలు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆందోళన విరమించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు శిరీష సోమ శేఖర్ రెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డి , ప్రభుదాస్ ,సాయి జెన్ శేఖర్, పార్టీ నాయకులు ,కార్యకర్తలు విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్బాక్స్ భారత్లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు