హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్లో కట్టుకున్న భార్యను హతమార్చాడో ప్రభుద్దుడు. హైదర్షాకోట్కు చెందిన బసవప్ప, పద్మ భార్యాభర్తలు. ఇవాళ ఉదయం బసవప్ప తన భార్య పద్మను హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు అతన్ని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..