Future City | వర్షాకాలం కావడంతో ఓ వైపు తమ భూముల్లో సాగు పనులు చేసుకుంటుండగా.. మరోవైపు ఫ్యూచర్ సిటీ మాయలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కు అవేమి పట్టడం లేదు. రైతులు దుక్కి దున్ని సాగు చేసుకున్న భూములను కోర్టు స్టే ఉన్నా పోలీసుల పహారాలో అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు పెట్టుబడి పెట్టి భూములు సాగు చేసుకుని రైతులు వేసిన విత్తనాలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. మరోవైపు మొలకలు వచ్చిన మొక్కజొన్నపంటను చూస్తూ కూడా పట్టించుకోకుండా జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు ఎలా లాక్కుంటుందో ఈ దృశ్యం మరోసారి కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
ఫ్యూచర్ సిటీలో పేదల భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు ఖర్చు చేసి రైతు వేసిన విత్తనాలను జేసీబీలతో తొలగిస్తున్న అధికారులు
పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం
కోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు తమ… pic.twitter.com/NyOe7tlFws
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026