జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణయ్య
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 19: కరోనా వైరస్ రెండో దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణయ్య అన్నారు. చిన్నచింతకుంట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రజలు కరోనా పరీక్షలు, అదేవిధంగా టీకా తీసుకోవడానికి వచ్చేవారికి భౌతికదూరం పాటించి, తప్పకుండా మాస్కులు ధరించాలని, చేతులు తరచుగా సబ్బునీటితో శుభ్రపరుచుకోవాలని సూచనలు ఇవాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి టీకా తీసుకోవడానికి వచ్చిన ప్రజలకు జాగ్రత్త సూచనలు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ సువర్ణరాజు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా
చెన్నై బౌలింగ్ Vs రాజస్థాన్ బ్యాటింగ్: మెరిసేదెవరో..?