ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో వాంఖడే స్టేడియంలో బిగ్ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు కసిగా ఉన్నాయి. రెండు జట్లు తమ చివరి మ్యాచ్ల్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించాయి.
చెన్నై బౌలింగ్, రాజస్థాన్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. ధోనీసేనతో పోరు నేపథ్యంలో కెప్టెన్ సంజూ వ్యూహాలకు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఇరుజట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి.