మామిడి కాయల కొనుగోళ్లకు సెర్ప్ రెడీ
ఈనెలఖారులో షురూ..
దళారీ వ్యవస్థకు చెక్..
రైతులకు మేలు
వికారాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ):దళారీ వ్యవస్థకు చెక్పెట్టడంతో పాటు మామిడి రైతులకు మేలు చేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలను ముమ్మరం చేసింది. ఈ నెలాఖరు నుంచి సెర్ప్ ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. అనంతగిరి, కుల్కచర్ల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా సేకరించి స్టేట్ ఫెడరేషన్ ‘బెనిషాన్’ ద్వారా డీ-మార్ట్, హెరిటేజ్ వంటి సూపర్ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు సకాలంలో డబ్బులు అందనున్నాయి. వికారాబాద్ జిల్లాలో 132 మంది రైతులు 155 ఎకరాల్లో మామిడి తోటను సాగుచేశారు. కాగా, సుమారుగా 200 టన్నులు కొనుగోలు చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు.
పంట విక్రయాల్లో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ..మామిడిపండ్ల కొనుగోళ్లకు సెర్ప్ ఏర్పాట్లు చేస్తున్నది. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా మామిడి రైతుకు ప్రయోజనం చేకూ ర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వం అందించే ధ్రువపత్రంతో సుదూర ప్రాంతాలు, విదేశాల్లో విక్రయించే విధంగా అవకాశం కల్పించింది. జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లల్లో మామిడి పంటకు డిమాండ్ ఉన్నా ..పంట పండించిన రైతులకు మాత్రం ఫలితం లేకుండా పోతున్నది. దళారీ వ్యవస్థ ఎక్కవ కావ డం..పెట్టుబడులు పెరగడం..ప్రకృతి వైపరీత్యాలతో సాగు నుంచి రైతులు దూరమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి సాగుదారులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ప్రత్యేక కార్యచరణ రూపొం దించి.. అమలుకు శ్రీకారం చుట్టింది.అయితే ఇప్పటికే సెర్ప్ రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఏ ర్పాట్లు చేసింది. అనంతగిరి, కుల్కచర్ల రైతు ఉత్పత్తి దా రుల కంపెనీ లిమిటెడ్ ద్వారా నాణ్యమైన కాయలనుకొని స్టేట్ ఫెడరేషన్ ‘బెనిషాన్’ ద్వారా డీ-మార్ట్, హెరిటేజ్ లాంటి హోల్సేల్ మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు ఎగు మతి చేయనున్నారు. రైతుల నుంచి తీసుకున్న పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తున్నది.
వికారాబాద్ జిల్లాలో 132 మంది రైతుల 155 ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్నారు.జిల్లాలోని మోమిన్పేట 3489 మామిడి చెట్లు ఉండగా..2272 చెట్లకు కాత, పూత వచ్చింది. అలాగే కుల్కచర్ల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 102 మంది రైతులు 16,821 చెట్లుంటే కాత..పూత 15,627 వచ్చాయి. 150 నుంచి 200 టన్ను లు కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈనెలాఖారు వరకు ఈ రెండు ప్రాం తాల్లో కొను గోళ్లు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. కొనుగోలు చేసిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తారు. బెనిషా , హిమాయత్, బంగినపల్లి, చిన్న రసాలు,పెద్ద రసాలు, తోతాపరి, దసేరి వంటి రకాలు సాగు చేస్తున్నారు.ఎకరాకు 3 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. సాగు విస్తీర్ణం నుంచి ఏటా దాదాపు 200 మెట్రిక్ టన్నులు పం ట ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 40శాతం పంటను దేశీయంగా,60 శాతం పం టను విదేశాల్లో విక్రయిస్తారు. రైతులు మాత్రం తమ పంటను వ్యాపారులకు,స్థానికంగా ఉన్న మార్కెట్లలో విక్రయిస్తున్నారు. హైదరాబాద్తో ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాల వుతోంది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టె క్కించడం కోసం ప్రభుత్వం మామిడి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమలుకు ఉద్యాన శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో నాలుగు సంఘాలు
జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణానికి అనుగుణంగా నాలుగు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు గ్రామీణాభివృధ్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని మోమిన్ పేట,కుల్కచర్ల మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘా లు ఉన్నాయి. శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తి దారుల సంస్థ లిమిటెడ్ , అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ కొనసాగుతున్నాయి. వీటితో పాటు జిల్లాలో మరో రెండు కొత్త సంఘాల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. బొంరాస్పేట, తాండూరు నూతన రైతు సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా సూపర్ మార్కెట్లకే..
రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ బెనిషాన్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా సెర్ప్ మామిడి కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుల నుంచి తీసుకున్న మామిడి పండ్లను స్టేట్ ఫెడరేషన్ ‘బెనిషాన్’ ద్వారా రాష్ట్రంలోని డీ-మార్ట్,హెరిటేజ్,ఇతర సూపర్ మార్కెట్లకు హోల్సేల్గా పంపించానున్నారు. జిల్లాలోని మామిడి రైతులకు మా ర్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంస్థ లిమిటెడ్, అనం తగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నేతృత్వంలో భరోసా కల్పిస్తున్నారు. గ్రామాల్లోనే కొనుగోలుకు విలేజ్ లెవల్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ (వీఎల్పీసీ)లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పండ్లు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం దీని ఆచరణలోకి తీసుకువచ్చింది.దాదాపు ఈనెలఖారు లేదా మే మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారానే సూపర్ మార్కెట్లకు తరలివెళ్లనున్నాయి.
రెండు చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మామిడి పంట రైతులకు జిల్లాలో రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ప్రజలకు నాణ్యమైన పండ్లను అందించి రైతులకు గిట్టుబాటు ధరకల్పించడం గ్రామీణాభివృద్ధి శాఖ టార్గెట్.మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు కొనసాగుతాయి. దళారీ వ్యవస్థ నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యం.
-కృష్ణన్,గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, వికారాబాద్ జిల్లా
ఇవి కూడా చదవండి
సలాం ఇబ్రహీంపేటలో పాల్గొన్న హోంమంత్రి
హాలియాలో సీఎం బహిరంగ సభ స్థలం పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్ష బీభత్సం