జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. పలిమెల మండల కేంద్రంతోపాటు సర్వాయిపేట లెంకలగడ్డ, పంకెన, మొదేడు తదితర గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సర్వాయిపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై 7 విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఆయా గ్రామాల్లోని ఇండ్ల రేకులు లేచిపోయాయి. చెట్లు నేల కూలి పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. కళ్లాల్లో ఆరబెట్టినా మిర్చి పంట పూర్తిగా నీట మునిగింది.