నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం శాసన మండలి విప్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం స్థల పరిశీలన చేశారు.
హాలియా పట్టణం సమీపంలోని దేవరకొండ రోడ్డులో స్థలాన్ని పరిశీలించి సభకు అనువైనదిగా గుర్తించారు. అక్కడే బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ హాలియాకు రానున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ : మంత్రి పువ్వాడ
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!