Gaddam Meghana | న్యూజిలాండ్లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన (18) యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైంది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న మేఘన.. చదువుతో పాటు సోషల్ సర్వీస్ చేయడంలో ముందుండటంతో న్యూజిలాండ్ ఎంపీగా ఎన్నికైంది. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవికి ఎంపికైంది.
ఉద్యోగరీత్యా గడ్డం మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్ – ఉష దంపతులు 2001లో న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడే మేఘన పుట్టి పెరిగింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. స్కూల్ డేస్ నుంచే మేఘన పలు చారిటీ కార్యక్రమాలు చేపడుతుంది. స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథా శరణాలయాలకు అందజేస్తుంది. వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, కనీస వసతులు కల్పించడంలోనూ సహాయపడుతుంది. దీంతో ఆమె సేవలను గుర్తించిన న్యూజిలాండ్ ప్రభుత్వం యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 16న ఆమెను పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసినట్లు మేఘన కుటుంబానికి వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్ నాన్ డమోలెస్ తెలియజేశారు. మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
కడప రిమ్స్లో యథావిధిగా ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు : ఎన్టీఆర్ వర్సిటీ
కాబోయే అల్లుడికి 365 వంటలతో ఆతిథ్యం..
సింగపూర్లో ఘనంగా సంక్రాంతి సంబురాలు