Thota Lakshmi Kantha Rao | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఖాకీల కనుసన్నల్లో ఇసుక మాఫియా దౌర్జన్యం ఎలా కొనసాగుతుందో స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే సభాముఖంగా చేసిన కామెంట్స్ మరోసారి రుజువు చేస్తున్నాయి. జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఓ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సార్ రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర నుండి ఇసుక మాఫియా సభ్యులు వచ్చి ఇసుక తీసుకపోతున్నారని పోలీసులకు ఫోన్ చేసి చెప్పి వారికి జీపీఎస్ కూడా పంపించాను. వాళ్లు దొరకరు. కానీ అర్థగంట తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు సార్ అని నాకు కాల్ చేశారు. అసలు విషయం ఏంటంటే వాళ్లు నాకు ఫోన్ చేసిన సమయంలో నేను వారున్న లొకేషన్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉన్నాను. వాళ్లు నాకు కనిపిస్తున్నారు.. అయినా కూడా పోలీసులు వాళ్లను వదిలేశారన్నారు.
పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మీది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మాఫియా డిపార్ట్మెంట్ అవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు హెచ్చరించారు. పోలీస్ అధికారుల వ్యవహారశైలి పట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే మీది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మాఫియా డిపార్ట్మెంట్ అవుతుంది
పోలీస్ అధికారుల పట్ల జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర నుండి ఇసుక మాఫియా సభ్యులు వచ్చి ఇసుక తీసుకపోతున్నారని పోలీసులకు చెప్పి, నేను జీపీఎస్ కూడా… pic.twitter.com/jNTz0u29Cr
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026