TG Polycet | హైదరాబాద్ : తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్(పాలిటెక్నిక్) పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్య మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.38 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నామాల లోకేష్(వరంగల్) ఫస్ట్ ర్యాంక్, బానోతు హేమనాథ్(సూర్యాపేట) సెకండ్ ర్యాంక్ సాధించారు. పరీక్షక హాజరైన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.