బాన్సువాడ, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచుతున్నదని, ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించడమే ఇందుకు నిదర్శనమని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. యాసంగిలో రైతులు పండించిన రా రైస్ను మాత్రమే తీసుకుంటామని, బాయిల్డ్ రైస్ను తీసుకోబోమని మెలిక పెట్టడం రైతులను ఇబ్బంది పెట్టడడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకే కొనుగోలు అధికారాలు ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బాన్సువాడ సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఆంక్షలు విధిస్తుందని అన్నారు. రా రైస్ను మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వడ్లను ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపడుతామన్నారు. సమావేశంలో బుడ్మి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మహ్మద్ ఎజాస్, మున్సిపల్ కౌన్సిలర్లు లింగమేశ్వర్, నర్సుగొండ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
పాత బాన్సువాడకు చెందిన లింగాల సుగుణకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 60 వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి అందజేశారు.
ఇవీ కూడా చదవండి..
ఎల్ఐసీ ద్వారానే రూ.లక్ష కోట్లు
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
కొవిడ్-19 కేసులెక్కువైనా.. విమానాలు రద్దు చేయం!