న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడుత కేసులు పెరుగడం వల్లే దేశవ్యాప్తంగా 100 శాతం విమాన సర్వీసులు నడుపలేకపోతున్నామన్నారు.
ప్రస్తుత పరిస్థితులు ప్రజలు ప్రయాణించడానికి సేఫెస్ట్ మోడ్ విమాన ప్రయాణమేనని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. కరోనా మార్గదర్శకాలను, నిబంధనలను పాటించని వారిపై సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ విమానాశ్రయం టర్మినల్ విస్తరణ వల్ల దేశంలో అభివ్రుద్ధి చెందుతున్న 2-3 శ్రేణి విమానాశ్రయాల్లో గోరఖ్పూర్ ఒకటిగా నిలుస్తుందన్నారు. గోరఖ్పూర్ విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం శంకుస్థాపన చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే మే నెలాఖరు నాటికి పూర్తి కావచ్చునని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఎయిర్ ఇండియా ఇప్పటికీ రూ.60 వేల రుణాల ఊబిలో చిక్కుకున్నదని, ఈ పరిస్థితుల్లో దాన్ని విక్రయించక తప్పడం లేదని తెలిపారు. దీంతోపాటు మరో పీఎస్యూ విమానయాన సంస్థ పవన్ హన్స్ వంటి సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!