న్యూఢిల్లీ : వర్చువల్ కరెన్సీలను నిషేధించవద్దని ఇద్దరు భారత సంతతికి చెందిన సింగపూర్ బ్లాక్చెయిన్ పారిశ్రామికవేత్తలు భారత ప్రభుత్వాన్ని కోరారు. వీరు ఇటీవలే డిజిటల్ కళాకృతిని కొనుగోలు చేయడానికి 69.3 మిలియన్ డాలర్లు క్రిప్టోకరెన్సీలో ఖర్చు చేశారు. ఇవి పశ్చిమ దేశాలు, మిగతా దేశాలకు మధ్య సమాన శక్తి అని వారు వాదిస్తున్నారు.
మెటాకోవన్ అనే మారుపేరు కలిగిన బ్లాక్చెయిన్ టెక్నాలజీలలో వ్యవస్థాపకుడు, కోడర్, ఏంజెల్ పెట్టుబడిదారుడు అయిన విఘ్నేష్ సుందరేసన్, అతడి స్నేహితుడు, మాజీ జర్నలిస్ట్ అయిన ఆనంద్ వెంకటేశ్వరన్, టూబాడోర్ పేరుతో 69.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 502 కోట్లు) మార్చి 11 న క్రిస్టీ వేలంలో డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ మైలురాయిగా నిలిచే ఆర్ట్వర్క్ను సొంతం చేసుకున్నారు. ఆర్ట్ వర్క్ ను సొంతం చేసుకున్న వ్యక్తి పేరు కాకుండా మెటాపర్స్ పేరును మాత్రమే క్రిస్టీ సంస్థ వెల్లడించింది. దాంతో సుందరేసన్ పేరు అప్పుడు వెలుగులోకి రాలేదు.
ఈ ఇద్దరు వాస్తవానికి తమిళనాడుకు చెందినవారు. వీరు ప్రపంచంలోనే అతిపెద్ద నాన్-ఫంగబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) ఫండ్ గా పేర్కొనే ‘మెటాపర్స్’ ను నడుపుతున్నారు. ఆర్ట్ నుండి స్పోర్ట్స్ ట్రేడింగ్ కార్డుల వరకు ఏదైనా నకిలీ చేయలేని వర్చువల్ కలెక్టర్ వస్తువులుగా మార్చడానికి క్రిప్టోకరెన్సీల వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్ఎఫ్టీ ఉపయోగిస్తున్నది. మెటాపర్స్ సబ్స్టాక్ ఖాతాపై వచ్చిన కథనంలో సుందరేసన్, వెంకటేశ్వరన్ తమ పేర్లను వెల్లడించారని స్ట్రెయిట్స్ టైమ్స్ గత వారం నివేదించింది.
క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తన అభిప్రాయాన్ని రూపొందిస్తున్నదని, క్రమాంకనం చేసిన స్థితిని తీసుకుంటుందని ఈ నెల ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.క్రిప్టోకరెన్సీలు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వంపై చూపే ప్రభావంపై రిజర్వ్ బ్యాంకుకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
ఆర్బీఐ 2018 లో వాస్తవంగా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ను నిషేధించింది. వర్చువల్ కరెన్సీల వ్యవహారాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ నియంత్రించే అన్ని సంస్థలను ఆదేశించింది.
కూరలో విలువైన ముత్యం.. థాయ్ పేదింటి మహిళకు అదృష్టం
సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..