అదృష్టం ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అచ్చం అలాంటి అనుభవమే థాయ్లాండ్లోని ఓ నిరేపేద మహిళకు కలిగింది. జనవరి 30 వ తేదీన సాతున్ ప్రావిన్స్లో రాత్రి భోజనంలో వంట కోసం కొడ్చకార్న్ తాంటివిట్కుల్ అనే మహిళ స్థానిక మార్కెట్ నుండి 70 భాట్లకు (రూ.163) సముద్రపు నత్తలను కొనుగోలు చేసింది.
నత్తలను కూరవండేందుకు చిన్న ముక్కలుగా కత్తిరించింది. నత్త గుండ్లలో ఒకదానిలో గుండ్రని నారింజ వస్తువు ఉన్నట్లు గుర్తించిన సదరు మహిళ.. తొలుత ఆ వస్తువు రాతిగా భావించింది. అయితే, అది ఆరు గ్రాముల మెలో పెర్ల్ అని తెలుసుకుని షాక్కు గురయ్యింది.
ఈ మెలో ముత్యం 1.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉన్నది. మెలో పెర్ల్ను తల్లికి చూపగా.. ఎంతో విలువైనదని చెప్పింది. కొడ్చకార్న్, ఆమె కుటుంబం ముత్యం దొరికిన విషయాన్ని రహస్యంగా ఉంచారు.
అయితే, తన తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందున వైద్య ఖర్చులను భరించడానికి ఈ ముత్యాన్ని విక్రయించాలని భావించింది. తన తల్లికి చికిత్స అందించేందుకు రూ.23.34 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారని, ఈ ముత్యాన్ని విక్రయించి వచ్చే నగదుతో చికిత్స చేయిస్తానని కొడ్చకార్న్ తెలిపింది.
ఇప్పటికే ఎన్నో ఆర్థిక బాధల్లో ఉన్నామని, తన భార్యకు చికిత్స చేయించేందుకు కూతురు ముందుకు రావడం సంతోషకరమని తండ్రి నివాట్ చెప్పారు. మెలో ముత్యం దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నివాట్ తెలిపారు. కడుపునిండా తినడం గురించి కాకుండా తన భార్యకు చికిత్స చేయించేందుకు ఈ డబ్బు వినియోగిస్తానని చెప్పుకొచ్చారు.
సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..