మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 29 : ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాలలోని 20వ, 32వ వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను పార్టీకి తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. అన్ని వర్గాలను కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
మహిళలకు రూ. 2500, పింఛను రూ. 4 వేలు, గ్యాస్ రూ. 500కే ఇస్తామని మాట మార్చారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాదెసత్యం, అంకం నరేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్రెడ్డి, ఎర్రం తిరుపతి, చంద్రశేఖర్ హండే, శ్రీరాముల మల్లేశ్, బొట్ల సత్యం, కర్రు శంకర్ పాల్గొన్నారు.