కుభీర్ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాలలో గిరిజన మహిళలు సంప్రదాయంగా జరుపుకునే ‘మేరా’ వేడుకల్లో జడ్పీటీసీ సభ్యురాలు అల్కాతాయి చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విభిన్న జాతులు, మతాలు, కులాలు, భాషలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాలలో వారి వారి జీవన విధానాలను అనుసరించి పండుగలు చేసుకోవడం తెలంగాణకే ప్రత్యేకమని పేర్కొన్నారు. అనంతరం దావూజీ నాయక్ తండాలో సర్పంచ్ శంకర్ జాదవ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్లతో కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
పార్డి(బీ)లో రూ.10లక్షలు, రామునాయక్ తండాలో రూ.6లక్షలు, పల్సిలో రూ.20లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసిఅభివృద్ది పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సత్వర అభివృద్దికి పెద్దపీట వేస్తోందని అన్నారు. సర్పంచులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని అన్నారు. జీపీ నిధులను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎంపీపీ తూం లక్ష్మి, ఎంపీడీవో రమేశ్, ఎస్సై గంగారాం, సర్పంచులు తూం పుష్పలత, శంకర్ జాదవ్, శ్రీరాముల కవిత రాజేశ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, పార్టీ మండల కన్వీనర్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కందుర్ సంతోష్, ఎస్సీ సెల్ కన్వీనర్ గాడేకర్ రమేశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ దొంతుల రాములు తదితరులు పాల్గొన్నారు.