నిర్మల్: జిల్లాలోని ముథోల్లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు లేని 87 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా రెండు కార్లు, ట్రాలీ వాహనం, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.