నస్పూర్, ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ తనిఖీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 2వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, పదోతరగతి పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఆయా చోట్ల 144 సెక్ష న్ అమలులో ఉంటుందని తెలిపారు. ఆ యనవెంట డీఈవో యాదయ్య ఉన్నారు.