ఖైరతాబాద్, ఏప్రిల్ 26 : గిరిజనులను మోసగించిన కాంగ్రెస్ను లోక్సభ ఎన్నికల్లో ఓడగొట్టితీరుతామని గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ, తమ ఓట్లతో గెలిచి తమ వర్గాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని, పైగా తెగల మధ్య చిచ్చుపెట్టే మ్యానిఫెస్టోను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర జనాభాలో 40లక్షలకు పైగా ఉన్న గిరిజనులకు మంత్రి , ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకా రం ఒక కుటుంబానికి రెండు అవకాశా లు ఇవ్వవద్దని, కానీ ఎమ్మెల్యే వివేక్ ఇంట్లో ముగ్గురికి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తమకు అన్యా యం చేసిన కాంగ్రెస్కు రాష్ట్రంలోని గిరిజనులందరూ ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎస్పీనాయక్, బాలునాయ క్, అఖిల్రాథోడ్, లచ్చునాయక్, రవినాయక్, ప్రభాస్నాయక్ పాల్గొన్నారు.