అహ్మదాబాద్: సెల్ఫీ దిగితే క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు గుజరాత్లోని డాంగ్ జిల్లా అధికారులు. కొండలు, జలపాతాలతో కూడిన పర్యాటక ప్రాంతమైన డాంగ్ జిల్లాకు వర్షాకాలంలో సందర్శకులు భారీసంఖ్యలో వస్తుంటారు. సెల్ఫీ తీసే క్రమంలో పలువురు ప్రమాదాలకు లోనవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పర్యాటకుల ప్రాణాలను రక్షించటానికి అధికారులు ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.