ఏవోకు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో గిరాకీలు లేక రోడ్డున పడ్డామని, కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నామని, ప్రభుత్వం ప్రతినెలా రూ. 12 వేలు చెల్లించి ఆదుకోవాలని ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్రావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్, మధుకర్, షఫీ, రాజు, రాంబాబు, హబీబ్, వెంకటేశ్, అంజయ్య, ఖలీమ్, మహేశ్, సత్యం, రమేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.