సారంగాపూర్, అక్టోబర్ 19: వ్యవసాయ భూ ముల్లో గంజాయి పంటను సాగు చేస్తే ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టెన్సెస్) యాక్ట్ కింద కేసులు నమోదులు చేస్తామ ని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని బండరేవుతండా, రాంసింగ్తండాకు చెందిన రాథోడ్ బాబురావ్, రాథోడ్ సంజీవ్, పవార్ రావోజీ, రాథోడ్ సంతోష్ తమ పత్తి చేన్లలో అంతర్ పంటగా గంజాయి పంటను సాగు చేస్తున్నారు. ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గంజాయి పంటపై మంగళవారం దాడి నిర్వహించారు. ఈ మేరకు డీఎస్పీ ఉపేం దర్రెడ్డి సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ నలుగురు పత్తి చేన్లలో సాగు చేస్తున్న 3.8 కిలోల గంజాయి, ఐదుఫీట్ల గల 85 మొక్కలను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 40వేలు ఉంటుందన్నారు. గంజాయి మొక్కలను పట్టుకు న్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిని అభినందిం చారు. వ్యవసాయ భూములు, ఇండ్లలో ఎవరైనా గంజాయి పంటను సాగు చేస్తే టోల్ఫ్రీనంబర్ 100 నంబర్కు ఫోన్ చేయాలని డీఎస్పీ సూచిం చారు. గంజాయి పంటను సాగు చేస్తున్న వారి పేర్లను చెబితే బహుమతులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న దని పేర్కొన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ వెంకటేశ్, ఎక్సైజ్ సీఐ కిశోర్, ఎస్ఐ రమణారెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు రవి కుమార్, రమేశ్, ఆర్ఐ ముంతాజ్, వీఆర్వో సందీప్, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.