నల్లగొండ, మే 4 : కలెక్టర్ ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ సమక్షంలో శనివారం రెండో విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో నిర్వహించిన ర్యాండమైజేషన్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన పోటీలో ఉన్న అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు.
నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు లేవని, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఆర్ఓలతోపాటు బీఆర్ఎస్ ఏజెంట్ పంకజ్ యాదవ్, బీఎస్పీ ఏజెంట్ శ్రీను, డీఎస్పీ ఏజెంట్ లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులు చొల్లేటి ప్రభాకరాచారి, పాలకూరి రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.