న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ లిస్ట్ను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదవుతున్నది. దీంతో జాబితా విడుదలను వాయిదావేసినట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రకటించింది. జాబితాను ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని అధికారిక వెబ్సైట్ kvsonlineadmission.kvs.gov.in.లో ప్రకటిస్తామని తెలిపింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబధించి ఒకటో తరగతి ప్రశాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ముగిసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాను శుక్రవారం విడుదల చేసిన తర్వాత.. ఏప్రిల్ 30న రెండు, మూడోజాబితాను విడుదల చేస్తామని, అప్పటికీ సీట్లు మిగిలినట్లయితే మే 5న అడ్మిషన్ ప్రక్రియను చేపడతామని ఇప్పటికే ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..