భోపాల్: ఆ మధ్య కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఇచ్చిన నినాదం గుర్తుందా. గో కరోనా గో అంటూ ఆయన చేసిన నినాదాన్ని చాలా మంది ఫన్నీ మీమ్స్గా మలిచారు. కానీ మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలోని గణేష్పురా అనే ఊరి వాళ్లు మాత్రం ఆయన నినాదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లున్నారు. భాగ్ కరోనా భాగ్ అంటూ చేతుల్లో కాగడాలు పట్టుకొని వైరస్ను పరుగెత్తిస్తున్నట్లుగా తీసిన ర్యాలీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆదివారం రాత్రి వీల్లు ఈ వింత పని చేశారు. వైరస్ను తమ ఊరి నుంచి తరిమి కొట్టడానికే ఈ ప్రయత్నం చేసినట్లు వాళ్లు చెప్పడం విశేషం. పరుగు ముగిసిన తర్వాత వాళ్లంతా ఆ కాగడాలను ఊరిబటయట గాల్లోకి విసిరేశారు. ఇలా చేస్తే వైరస్ వెళ్లిపోతుందని వాళ్లు విశ్వసిస్తుండటం విశేషం. ఎప్పుడు ఇలాంటి మహమ్మారి వచ్చినా ఊళ్లోని ఇంటికొకరు ఇలా చేయడం ఆనవాయితీ అని ఊళ్లోని ఓ పెద్ద చెప్పారు. అది కూడా ఆదివారం లేదా బుధవారం రాత్రిళ్లే ఇలా చేస్తారట. గత రెండు, మూడు రోజులుగా ఊళ్లో రోజుకొకరు చనిపోతున్నారని, దీంతో భయాందోళనకు గురైన వాళ్లు ఇలా చేశారు.