హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్-ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు ఈనెల 16 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారు ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి.
మొత్తం పోస్టులు: 119
ఇందులో ప్రొఫెసర్ 29, అడిషనల్ ప్రొఫెసర్ 18, అసిస్టెంట్ ప్రొఫెసర్ 72 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. నాన్మెడికల్ అభ్యర్థులు అయితే హ్యూమన్ అనాటమీలో ఎమ్మెస్సీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ ఫార్మకాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 16
వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..