జొహన్నెస్బర్గ్: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి వెళ్లే విమానాలపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి. ఇక నౌకలపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. ఆ భారీ కార్గో నౌక డర్బన్కు వచ్చిందని, ఈ నేపథ్యంలో అందులో ఉన్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారికి పాజిటివ్ వచ్చిందని దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ నిర్ధారించింది.
ప్రస్తుతం ఆ నౌక క్వారంటైన్లో ఉందని, అందులోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎవరికీ అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. వారిని ఎవరెవరు కలిశారనే విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. కాగా, ఆ నౌకలో గత ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వారంతా 3 వేలకు పైగా టన్నుల బియ్యాన్ని అందులోనుంచి దించుతున్నారని పేర్కొన్నాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నదని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..