చెన్నై: దేశంలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నవేళ.. ఆక్సిజన్ కొరత కరోనా రోగులను పొట్టనపెట్టుకుంటున్నది. ప్రతిరోజు ఏదో ఒకచోట ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులోని చెంగల్పట్టులో విషాదం చోటుచేసుకున్నది. చెంగల్పట్టులోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను అధికారులు ఇతర హాస్పిటళ్లకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం తలెత్తిందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇలాంటి ఘటనే కర్ణాటకలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. కర్ణాటలోని చామరాజనగర్లో ఉన్న జిల్లా దవాఖానలో సోమవారం తెల్లవారుజామున ఆక్సిజన్ అందకపోవడంతో 2 గంటల్లో 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో కొందరు కోవిడ్ పేషంట్లు కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటల మధ్య వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..